వైవీయూ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఏఐబీఎస్యూ నాయకుడు జగన్ రాథోడ్ డీఆర్వోకు ఫిర్యాదు చేశారు. అనుమతి పొందిన ప్రదేశంలో కాకుండా వేరే చోట అడ్మిషన్లు కల్పిస్తున్నారని, స్థానిక విద్యార్థులను విస్మరించి, ఎడ్ సెట్ పరీక్ష రాయకుండానే పొరుగు రాష్ట్రాల విద్యార్థులకు లక్షల్లో సీట్లు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.