కడప నగర శివారులోని వినాయక గూడెం వెనుక ఉన్న వంకలను కొందరు ఆక్రమిస్తున్నారని, ప్రభుత్వ స్థలాలతో పాటు వంకలను మింగేస్తున్నారని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి వంకలకు రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఆధారాలతో కలెక్టర్కు ఫిర్యాదు చేసి కబ్జారాయుళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.