కడపలోని ఎర్రముక్కపల్లి-విశ్వనాధపురం రైల్వే అండర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని సీపీఎం కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించిన ఆయన, విశ్వనాధపురం వైపు పనులు ఆపడం సరికాదని, భూసేకరణ పూర్తి చేసి పరిహారం చెల్లించి వెంటనే వంతెన నిర్మించాలని కోరారు. పనులు చేయకపోతే ప్రజల తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.