కడప ఇందిరానగర్ 3వ సర్కిల్లో 11 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. వర్షాలకు మోటారు వైరు కాలిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని రాయలసీమ కమ్యూనిస్టు నేత రమేష్ బాబు ఆరోపించారు. చిన్న వైరు మార్చడానికి ఇంత సమయం తీసుకోవడం సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని, వెంటనే సమస్యను పరిష్కరించి నీటిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం. ప్రసాద్, రవి, స్థానిక మహిళలు పాల్గొన్నారు.