బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వీరుడు టిప్పు సుల్తాన్ 227వ వర్ధంతి సభలను మే 4న జయప్రదం చేయాలని ఆప్ కీ ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మక్బూల్ బాషా కోరారు. కడపలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుల చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. టిప్పు సుల్తాన్పై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిజమైన చరిత్ర చదివి వాస్తవాలు గ్రహించాలని ఆయన హితవు పలికారు.