అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా సోమవారం కడపలో విద్యార్థులతో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మహిళలు, బాలికల భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. మహిళలకు ఆపదొస్తే వెంటనే డయల్ 112కు కాల్ చేయాలని సూచించారు. మార్చి 8న జరిగే వేడుకల్లో వివిధ పోటీల విజేతలకు బహుమతులు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.