శనివారం చెన్నూరు మండలం ఓబుళంపల్లిలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కమలాపురం నియోజకవర్గం వైసీపీ చార్జీ పోచంరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్ట పరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరుస తుఫాన్ లతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.