కడప: ఘాట్ రోడ్ లో బియ్యం లారీలో మంటలు

6చూసినవారు
ఆదివారం ఉదయం చింతకొమ్మదిన్నె మండలం కడప-రాయచోటి ప్రధాన రహదారిలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్ లో బియ్యం లోడుతో వెళుతున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పొగలు వ్యాపించడంతో ఇతర వాహనదారులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్