మదనపల్లెలోని నీరుగట్టుపల్లె చౌడేశ్వరినగర్ 2వ వీధిలో తాళం వేసిన ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గురువారం పోలీసులకు సమాచారం అందడంతో, రాయచోటి మండలం బట్లపల్లికి చెందిన జయరాం ఇంట్లో అతని భార్య, పిల్లలు లేకపోవడం, జయరాం కూడా అదృశ్యమవ్వడంతో పోలీసులు లోపల మృతదేహాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.