బాధితులకు మర్యాద – సత్వర న్యాయం పై డీఐజీ ఆదేశాలు

27చూసినవారు
బాధితులకు మర్యాద – సత్వర న్యాయం పై డీఐజీ ఆదేశాలు
అన్నమయ్య జిల్లా పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ మంగళవారం సందర్శించారు. ఫిర్యాదుదారులతో గౌరవంగా ప్రవర్తించి, వారి సమస్యలకు చట్టపరంగా సత్వర న్యాయం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలు, మహిళల భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు. ప్రజల్లో చైతన్యం పెంచి, శాంతిభద్రతలు కాపాడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్