కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్థాపానికి గురైన కర్ణాటక వాసి సయ్యద్ బాబు (56) మంగళవారం మదనపల్లెలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. రాయల్పాడు సమీపంలోని అడ్డగల్లులో నివసిస్తున్న ఆయన ఇంట్లో పురుగుమందు తాగినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఔట్పోస్ట్ పోలీసులు తెలిపారు.