మదనపల్లె కురవంకలో మంగళవారం ఉదయం భాగ్యమ్మ (60) అనే వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్, చంద్రకళ దంపతులు దాడి చేశారు. ఇంటి ముందు ముఖం కడుక్కుంటున్న భాగ్యమ్మ ఉమ్మగా తమను చూసి కావాలనే చేసిందని భావించిన దంపతులు ఆమెపై కుర్చీతో దాడి చేశారు. ఈ ఘటనలో భాగ్యమ్మ తలకు బలమైన గాయాలై రక్తస్రావం కావడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మదనపల్లి 1 టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.