మదనపల్లి మండలంలోని సిటిఎం స్పిన్నింగ్ మిల్లు భవనం కూల్చుతుండగా శనివారం అపశృతి చోటుచేసుకుంది. జెసిబి వాహనంపై గోడ కూలడంతో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుడు వివరాలు, అతను ఎవరు అన్నది ఇంతవరకు తెలియలేదు. సమాచారం తెలుసుకున్న డి. ఎస్. పి కొండయ్య నాయుడు తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తాలూకా పోలీసులు విచారణ చేపట్టారు.