మదనపల్లె: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి - ASP

1చూసినవారు
మదనపల్లె: పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి - ASP
అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వెంకటాద్రి, మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు బుధవారం డిఎస్పీ కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్షలో, శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యం వహించరాదని, బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆయన సూచించారు. ఈ సమీక్షలో మదనపల్లె, పుంగనూరు, బి. కొత్తకోట సర్కిళ్ల సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్