మైదుకూరులో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సోమవారం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాలతో డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్, సిఐ రమణా రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో ప్రొద్దుటూరు రోడ్డు, జగనన్న కాలనీ, నంద్యాల రోడ్డు ప్రాంతాల్లో అనుమానితులను పట్టుకుంటున్నారు. బహిరంగ మద్యపానం, గంజాయి సేవించే వారిపై కఠిన చర్యలు తప్పవని, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.