మైదుకూరులో రన్ ఫర్ యూనిటీ

జాతీయ ఐక్యత దినోత్సవం, సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మైదుకూరులో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని మైదుకూరు డీఎస్పీ జి. రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఐక్యతే మహా బలం అని, ఐక్యత లేకపోవడమే సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ కె. రమణారెడ్డి, పోలీస్ సిబ్బంది, మేధా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
