బుధవారం సాయంత్రం పీలేరు పట్టణం సైనిక్నగర్లో బాబు అనే వ్యక్తి, ఎర్రవారిపాలెం మండలం ఎల్లమందకు చెందిన రమేష్పై అమానుష దాడికి పాల్పడ్డాడు. సీవీ మహల్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో, బాబు రమేష్ను రాళ్లతో కొట్టి, కాళ్లతో తన్నినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రమేష్ ఆపస్మారక స్థితికి చేరుకోగా, స్థానికులు దాడిచేసిన వ్యక్తిని అడ్డుకున్నారు. గాయపడిన రమేష్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు, పోలీసులు విచారణ చేపట్టారు.