గుర్రంకొండ మండలంలో శుక్రవారం హోటల్ నిర్వాహకుడు పాలగిరి రజాక్పై పాత కక్షలతో కలకడ మండలానికి చెందిన బ్రహ్మయ్య నాయుడు, అతని అనుచరులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో రజాక్ తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు అతడిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.