ప్రొద్దుటూరులో మంగళవారం సాయంత్రం బిహార్కు చెందిన మున్నా కుమార్ (33) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక రాజీవ్ పార్క్ వెనుక వైపు డైరీ ఫాంలో రెండు నెలలుగా పనిచేస్తున్న మున్నా, తన స్నేహితుడు దీపును పిలిపించుకున్నాడు. మున్నా మృతి చెందినప్పటి నుంచి దీపు కనిపించకుండా పోయాడు, అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. యజమాని సమాచారం మేరకు రూరల్ సీఐ నాగభూషణ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.