ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుటుంబానికి చెందిన ఎస్ ఎస్ మాల్పై ఉన్న బీపీఎస్ బకాయిలు రూ. 9 కోట్లను మున్సిపాలిటీకి రాబట్టాలని స్థానిక మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, టీడీపీ నేత ప్రవీణ్కు సూచించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన కుమారుడు కొండారెడ్డిలకు భయపడి, ప్రతిపక్షంలో ఉన్న తనకు ఈ సూచన చేస్తున్నారని రాచమల్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కుటుంబం నుంచి బకాయిలను వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.