ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ, తమది రైతు ప్రభుత్వం అని, రైతుల అభివృద్ధే తమ ధ్యేయమని తెలిపారు. బుధవారం ఉప్పరపల్లెలో నిర్వహించిన 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు పాటుపడుతున్నారని, గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. జెడిఏ చంద్ర నాయక్ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.