వెనుకబడిన వర్గాల ప్రత్యేక కమిషన్ తరఫున, స్థానిక సంస్థల రిజర్వేషన్లపై అధ్యయనం చేయడానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా బద్వేల్ పురపాలక సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అమలు విధానం, ప్రగతి వివరాలను పరిశీలించారు. అనంతరం గాంధీనగర్ ప్రాంతంలోని పలు గృహాలను సందర్శించి సర్వే నిర్వహించారు.