గురువారం వేంపల్లి ఇడుపులపాయలోని దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించేంత వరకు పోరాటం చేస్తామని వైఎస్సార్ సాక్షిగా ప్రమాణం చేశారు. ఆయన వేంపల్లెలో తనపై నమోదైన కేసు నిమిత్తం విచారణకు వెళ్లనున్నారు.