సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద నూతనంగా నిర్మిస్తున్న గణపతి ఆలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దాతలు, గ్రామస్థులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సహకారంతో సుమారు రూ. 10 లక్షల వ్యయంతో ఆలయ నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. అలాగే గణపతి ఆలయం నుంచి బిదినం చెర్ల గ్రామ మెయిన్ రోడ్డు వరకు తారు రోడ్డు పనులు జరుగుతున్నాయి.