పులివెందులకు చెందిన ఓ చిన్నారి జ్వరంతో బాధపడుతూ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు, గత నెలలో చిన్నారికి జ్వరం రాగా, ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతిగా డోస్ వాడటం వల్ల చిన్నారి పరిస్థితి విషమించిందని, అతిగా డోస్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని మరో వైద్యుడు చెప్పినట్లు వారు తెలిపారు. అయితే, తాను సక్రమంగా డోస్ ఇచ్చానని వైద్యుడు తెలుపుతున్నారు.