కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ను కలిసి రైతుల సమస్యలపై చర్చించారు. అక్టోబర్లో కలెక్టర్ను ఉల్లి రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరామని, హెక్టార్కు రూ. 50 వేలు మద్దతు ధర ఇవ్వాలని అడిగినట్లు తెలిపారు. తక్షణం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినా, ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎంపీ ఆరోపించారు.