వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ భార్య ధనలక్ష్మిని ఒక వ్యక్తి బెదిరించినట్లు ఆయన తెలిపారు. బుధవారం రాత్రి ధనలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సునీల్ కుమార్, తనను ఇబ్బంది పెట్టడం సరికాదని, తనను ఏమీ చేయలేక కుటుంబ సభ్యులను బెదిరించడం అన్యాయమని అన్నారు.