దోషులను కఠినంగా శిక్షించాలి: జర్నలిస్టులు

26చూసినవారు
దోషులను కఠినంగా శిక్షించాలి: జర్నలిస్టులు
చిత్తూరు జిల్లా వి. కోటకు చెందిన జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను పులివెందుల జర్నలిస్టుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటన జర్నలిస్టుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పులివెందుల జర్నలిస్టుల సంఘం నాయకులు స్థానిక డీఎస్పీ మొరళి నాయక్ని కలిసి వినతిపత్రం ఇచ్చారు. నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్