పులివెందుల పట్టణంలోని స్థానిక ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో ఉన్న జయమ్మ కాంప్లెక్స్లో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. తోపుడు బండిపై రాత్రి నిద్రపోయిన వ్యక్తి ఉదయం చనిపోయి కనిపించాడని స్థానికులు తెలిపారు. మృతుడు వడ్డెర కులానికి చెందిన వ్యక్తి అని, అతని ఆచూకీ తెలిస్తే వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని స్థానికులు కోరుతున్నారు.