కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని జనసేన నియోజకవర్గ ఇంచార్జీ డా. హరీష్ బుధవారం వేంపల్లి వ్యవసాయ మార్కెట్ ను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. రైతుల ఉత్పత్తులు కచ్చితంగా నమోదు చేయాలని, ఏదైనా అక్రమ రవాణా జరిగితే తక్షణమే స్పందించి అధికారులకు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కు సమాచారం తెలపాలని, లేని పక్షంలో సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన సూచించారు.