వేంపల్లి: యోగా ప్రాముఖ్యతపై అవగాహన

20చూసినవారు
వేంపల్లి: యోగా ప్రాముఖ్యతపై అవగాహన
వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలలో యోగ సాధన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మంగళవారం తంగేడుపల్లి ప్రాధమిక పాఠశాలలో ముగిసిన ఈ శిబిరాలలో విశ్రాంత అధ్యాపకుడు రామకృష్ణారెడ్డి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. యోగ సాధనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆరు రకాల ఆసనాలను విద్యార్థులకు సాధన చేయించారని అధికారి డా. ఓబుల్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :