శుక్రవారం వేముల మండలంలోని గొల్లల గూడూరు గ్రామంలో శనగ పంట విత్తే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు మండల వ్యవసాయ అధికారి జిపి ఓబులేసు, విస్తరణాధికారి సురేష్ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఫంగిసైడ్, ట్రైకోడెర్మా, రైజోబియం కల్చర్ వాడకం ద్వారా పంట వ్యాధులను నివారించవచ్చని, విత్తనాలను నీడలో ఆరబెట్టి 24 గంటల్లో విత్తాలని సూచించారు.