కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ను వ్యతిరేకిస్తూ, సిఐటియు ఆధ్వర్యంలో శనివారం ఏపీఎండిసి కార్మికులు మంగంపేటలో ధర్నా చేపట్టారు. ఈ కోడ్స్ ఉద్యోగ భద్రత, జీతాల హక్కులకు ముప్పు తెస్తాయని, 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నష్టదాయకమైన కోడ్స్ను వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.