పెనగలూరు: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి

12చూసినవారు
పెనగలూరు: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి
అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం తిరునంపల్లి గ్రామం సమీపంలో మంగళవారం సాయంత్రం గుంజనేరు వద్ద చేపలు పట్టేందుకు వెళ్లిన శ్రీను (47) మరియు మల్లికార్జున (37) అనే ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగి మృతి చెందారు. స్థానికుల సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను వెలికితీసి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్