రాజంపేటను జిల్లా కేంద్రంగా మార్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ విప్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రైల్వేకోడూరు టీడీపీ ఇంచార్జ్, కడప కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి వినతి పత్రం అందజేశారు. రాజంపేటకు జిల్లా కేంద్రంగా కావాల్సిన అన్ని అర్హతలు, సౌకర్యాలు ఉన్నాయని, ప్రజల దీర్ఘకాల డిమాండ్ను నెరవేర్చాలని వారు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.