సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి (వాసు) మాట్లాడుతూ, అధికారుల సమాచార లోపంతోనే ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో కలిపినట్టు తెలిపారు. కడప కలెక్టర్ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం జిల్లాల విభజనను ఇష్టానుసారంగా చేసిందని, భౌగోళికంగా, శాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.