తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు బుధవారం వైకాపా పాలనపై విమర్శలు గుప్పించారు. రాజంపేట బాలాజీ నగర్ 9వ వార్డులో ఇంటింటికి తెదేపా కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, వైకాపా హయాంలో అవినీతి తప్ప అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో పాటు పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. "తల్లికి వందనం", వితంతు పింఛన్లు వంటి పథకాలను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.