రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం రాయచోటి క్యాంప్ కార్యాలయంలో ఆర్డిఓ, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రం రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ సహకారం అందిస్తారని తెలిపారు. రాయచోటి మరింత అభివృద్ధి చెందేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.