రాయచోటిలో ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ, 18 ఏళ్ల లోపు మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ద్విచక్రవాహనాలు లేదా ఇతర వాహనాలు నడపడానికి ఇవ్వనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిపక్షంలో వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రజల భద్రత కోసం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.