ములకలచెరువు ఎక్సైజ్ స్టేషన్ సమీపంలో కుటీర పరిశ్రమలా నకిలీ మద్యం తయారీ జరుగుతున్నా అధికార వ్యవస్థ చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మంగళవారం ప్రశ్నించారు. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశైపై కొన్ని అక్రమ కేసులు పెట్టారని, మరో నాలుగు కేసులు వచ్చినా భయపడలేదని, న్యాయం తమ వైపు ఉందని ఆయన పేర్కొన్నారు. సిట్ కాకుండా సీబీఐతో విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.