బుధవారం బి. కొత్తకోట మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తుమ్మనగుట్టకు చెందిన రైతు ఎర్రమద్దు ఈశ్వరరెడ్డి (54) తన వ్యవసాయ బావి వద్ద టమోటా పంట పనులకు వెళ్ళాడు. ఎండ వేడిమిని తట్టుకోలేక బావిలో ఈతకు దిగగా ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.