కురబలకోట మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంగళ్లు గ్రామ చేనేత నగర్కు చెందిన రామాంజులు, మారుతీనగర్కు చెందిన సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. అంగళ్లుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, కారును ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. స్థానికులు వారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.