మంగళవారం, తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెరుగుతున్న కేబుల్ వైర్ల చోరీలు, నగల మోసాల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ అనిల్ కుమార్ సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గస్తీ పెంచామని, షాపుల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.