కురబలకోట మండలం దిగువ బోయపల్లెకు చెందిన లక్ష్మీదేవి (22) మంగళవారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యుల చికిత్సతో ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. యువతి ఈ చర్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.