కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించడానికి నాయకులు, అభిమానులు ఎవరూ రావద్దని ఆయన తనయుడు వీర రాఘవరావు విజ్ఞప్తి చేశారు. పరామర్శల వల్ల ఆసుపత్రి సిబ్బందికి, వైద్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కాబట్టి ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.