కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని ఈశ్వర్ నగర్ చర్చికి అన్ని అనుమతులు ఉన్నాయని చర్చి ఫాదర్లు స్పష్టం చేశారు. బుధవారం కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో పాస్టర్ డేవిడ్, విలియమ్స్ మాట్లాడుతూ, కొందరు కావాలనే
రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అనుమతుల పత్రాలను మీడియాకు చూపించి, అవసరమైతే చర్చి రికార్డులను ఎవరైనా తనిఖీ చేసుకోవచ్చని బహిరంగ సవాల్ విసిరారు.