పెద్దాపురం ఏడీబీ రహదారిపై సోమవారం ఇసుక లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ప్రయాణికుల వాహనాన్ని తప్పించే క్రమంలో లారీ అదుపు తప్పిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.