పిఠాపురం మండలం తిమ్మాపురం శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. యర్రవరం నుంచి పిఠాపురం వస్తున్న తల్లి, కుమారుడు ప్రయాణిస్తున్న స్కూటర్ను ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.