ప్రత్తిపాడు క్వారీలో పేలుళ్ల కలకలం.. పరుగులు తీసిన కూలీలు

2చూసినవారు
ప్రత్తిపాడు క్వారీలో పేలుళ్ల కలకలం.. పరుగులు తీసిన కూలీలు
ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి వద్ద ఓ స్టోన్ క్రషర్ క్వారీలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ ధాటికి నల్లరాతి పర్వతం కుప్పకూలడంతో రాళ్లు మీద పడి జేసీబీ ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డారు. కూలీలు ప్రాణభయంతో పరుగులు తీశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రుడిని గుట్టుచప్పుడు కాకుండా కాకినాడ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనతో మైనింగ్ ప్రాంతం దద్దరిల్లిపోయింది.

సంబంధిత పోస్ట్