AP: కూటమి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,592 పాఠశాలల్లో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమంలో భాగంగా బాలికలకు కరాటే నేర్పించనున్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న బాలికలకు ఈ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో రెండు నెలలపాటు 20 తరగతులను నిర్వహిస్తారు. ప్రతి తరగతి 90 నిమిషాల పాటు ఉంటుందని సమగ్ర శిక్షా అభియాన్ తెలిపింది.